టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు. ఇకపోతే ఈయన ఎంత గొప్ప స్టార్ ఈమేజ్ ను కలిగి ఉన్న దానిని బయటకు ఏ మాత్రం చూపించాడు. చాలా సదాసీదా వ్యక్తి గా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే ఎంతో సింప్లిసిటీగా బయట కూడా ఉంటాడు. దానితో ఈయన వ్యక్తిత్వానికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపాందుతున్న రాజా సాబ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో నిధి అగర్వాల్ , రీద్దీ కుమార్ , మాళవిక మోహన్ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... సంజయ్ దత్మూవీ లో ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో దాదాపు 125 కోట్ల బడ్జెట్ ప్రభాస్ రెమ్యూనిరేషన్ కే పోనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రభాస్ మాత్రం ఈ సినిమాకు 125 కోట్లు రెమ్యూనిరేషన్ ను తీసుకోవాలి అనుకున్న ప్రస్తుతం మాత్రం 85 నుండి 90 కోట్ల మధ్యలోనే పారితోషకం తీసుకోవాలి అనుకున్నట్టు తెలుస్తుంది.

అందుకు ప్రధాన కారణం కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ ని తెలుగు లో టీ జీ విశ్వ ప్రసాద్ భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేశాడు. కానీ ఈ మూవీ ద్వారా ఆయనకు దాదాపు 30 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆయనకు ఆది పురుష్ మూవీ ద్వారా 30 కోట్ల నష్టం రావడంతో అంత మేర తాను నిర్మిస్తున్న రాజా సాబ్ మూవీ లో పారితోషకాన్ని ప్రభాస్ తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక ఇలా తన సినిమా ద్వారా నష్టం వచ్చిన నిర్మాత కోసం ఏకంగా తన పారితోషకాన్ని ప్రభాస్ తగ్గించుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: