అప్పట్లో హీరోయిన్స్ గా నటించిన చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు చూస్తే అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు.. అలాంటి వారిలో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి కూడా ఒకరు.. ఇమే 1980లో హీరో, మేరీ జంగ్, దామిని వంట చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది అలనాటి హీరోయిన్ మీనాక్షి శేషాద్రి.. వివాహం తర్వాత ఒక్క సారిగా ఇమే బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి తన భర్త పిల్లలతో కలిసి యూఎస్ఏ లో సెటిల్ అయిపోయిందట. అక్కడే ఒక డాన్స్ స్కూల్ ని ప్రారంభించి ఈమె ఒడిస్సా , కథక్కలి  భరతనాట్యం వంటి డ్యాన్సులను నేర్పిస్తోందట.



తాజగా ఈమె పాట పాడుతూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఈ వీడియోను చూసిన పలువురు నెటిజెన్స్ ఈ నటి పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. మీనాక్షి శేషాద్రి తెలుగులో స్టార్ హీరోయిన చిరంజీవి సరసన ఆపద్బాంధవుడు సినిమాలో నటించింది. ఈ చిత్రానికి గాను ఈమెకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు తెలుగులో మొదట జీవన పోరాటం అనే సినిమాలో కూడా నటించింది మీనాక్షి శేషాద్రి.


ఆ తర్వాత బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అనే చిత్రంలో కూడా నటించింది 1995లో మీనాక్షి శేషాద్రి హరీష్ మైసూర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. వీరికి ప్రస్తుతం ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. మీనాక్షి శేషాద్రి తెలుగు హిందీ లోనే కాకుండా తమిళంలో కూడా అడపా దడపా చిత్రాలలో నటించింది. ప్రస్తుతం మేమే వయసు 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అదే అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. సినీ ఇండస్ట్రీలోకి 17 సంవత్సరాల వయసులోనే ఇండియన్ వీక్లీ మిస్ ఇండియా పోటీలలో కూడా ఈమె గెలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభిమానులు అయితే ఏమైనా తిరిగి ఏదైనా సినిమాలలో నటించమని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: