బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించి స్టార్ మా ఛానెల్ ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. సీజన్ 8 లోగో, ప్రోమో కూడా రిలీజ్ చేసింది. హోస్ట్ నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీటిని ప్రేక్షకులతో పంచుకున్నారు. "ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు మేం మళ్లీ వస్తున్నాం. సీజన్ 8 లోగో ఇదే. బిగ్‌బాస్ 8తో ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాం." అని నాగార్జున అన్నారు.కాగా ఈ బిగ్‌బాస్ సీజన్ 8 లోగో కలర్‌ఫుల్ డిజైన్‌తో చాలామందిని ఆకట్టుకుంది. ఈ లోగోలోని నంబర్ 8 డిజైన్ ఇన్ఫినిట్ సింబల్ లాగా ఉంది. లోగో మధ్యలో ఓ ఫ్లవర్ మొత్తం లుక్కును మరింత అందంగా మార్చింది. మరి ఈసారి బిగ్‌బాస్ హౌస్ ఎలా ఉండనుంది? దాన్ని ఎలా డిజైన్ చేస్తారు? అని ప్రేక్షకులు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ హౌస్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. సీజన్ 6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి మీకు గుర్తుండే ఉంటాడు. ఇతడు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తున్నాడు.

అయితే తన లేటెస్ట్ యూట్యూబ్ వీడియోలో బిగ్‌బాస్ హౌస్‌లో చాలా సీక్రెట్ మైక్స్, సీక్రెట్ కెమెరాలు ఉంటాయని చెప్పాడు. దాంతో అందరూ నిర్ఘాంత పోయారు. ఆదిరెడ్డి చెప్పినట్లు ప్రతి సీజన్ స్టార్టింగ్‌కు 30 రోజుల ముందే బిగ్‌బాస్ హౌస్ బిల్డ్ చేస్తారు. అంతా పూర్తయ్యాక ఏవైనా లోపాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. ఉంటే వాటిని ఫిక్స్ చేస్తారు. ఇదే క్రమంలో బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతి చోటా కూడా సీక్రెట్ మైక్రోలు, కెమెరాలు ఇన్‌స్టాల్ చేస్తారని ఆదిరెడ్డి అన్నాడు. చివరికి బాత్ రూమ్ లో కూడా సీక్రెట్ మైక్స్ పెడతారని ఆయన చెప్పాడు. సాధారణంగా బాత్‌రూమ్స్ వాడుకునే ముందు కంటెస్టెంట్స్ మైక్ తొలగించి, దాన్ని బయటపెడతారు. అయితే వాష్ రూమ్ లో ఉన్నప్పుడు చేసే సౌండ్స్ ఎవరికీ వినిపించవని వీళ్లు అనుకుంటారు. కానీ అలా అనుకోవటమే పొరపాటేనట. ఎందుకంటే సీక్రెట్ మైక్స్ బాత్‌రూమ్‌లోనూ ఉంటాయట. వాటి ద్వారా నిర్వాహకులు మాటలు వింటారని ఆదిరెడ్డి చెప్తున్నాడు.

మైకులు బ్యాటరీలతో వర్క్ అవుతాయి. చార్జింగ్ అయిపోతే స్టోర్ రూమ్ లోకి వెళ్లి బ్యాటరీలు మార్చవచ్చు. బ్యాటరీస్ తీసేసాక తమ మాట ఎవరికీ వినపడదు అనుకొని కొంతమంది కంటెస్టెంట్స్ ఏదో ఒక మాట జారేస్తుంటారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్లు బ్యాటరీస్ తీసేసిన సరే సీక్రెట్ మైక్స్ ద్వారా అన్ని విషయాలు తెలిసిపోతాయట. ఇక మైకుల వలే కెమెరాలు కూడా ప్రతిచోట అమర్చుతారని ఆదిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి ఆదిరెడ్డి చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో తెలియదు కానీ అందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ జాగ్రత్తగా ఉండటం ఎందుకైనా మంచిది అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: