తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొన్ని సంవత్సరాల క్రితం ఫిదా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. శేకర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ మంచి అంచనాల నడుమ 2017 జూలై 21వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు కూడా ఆ టైమ్ లో వచ్చాయి. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 7 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ సందర్భంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు ఈ మూవీ కి వచ్చాయి.

మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.  ఈ మూవీ కి దాదాపుగా 18 కోట్ల రేంజ్ లో ప్రి రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి 48.5 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్ లు దక్కాయి. దానితో ఈ మూవీ కి 30.5 కోట్ల లాభాలు దక్కాయి. అలా ఈ మూవీ ఆ సమయంలో భారీ లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తో వరుణ్ తేజ్ , సాయి పల్లవి కి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలు లభించగా ... శేఖర్ కమ్ముల క్రేజ్ కూడా ఈ మూవీ తో మరింతగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: