బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకుని మూడేళ్లు అయింది. 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2021 లో తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులపై ఇన్నేళ్ల తర్వాత కిరణ్ రావ్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. నిజానికి చాలా మంది ని షాక్కు గురి చేస్తోంది. నిజానికి విడాకుల తర్వాత కూడా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ తరచూ కుటుంబంతో, తమ కొడుకుతో సరదాగా గడుపుతుంటారు. ఈ మధ్యే లపత లేడీస్ మూవీని కిరణ్ డైరెక్ట్ చేసింది. ఆ సినిమాను అమీర్ ఖాన్ నిర్మించడం విశేషం. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. నెట్లిక్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా అమీర్ తో విడాకుల గురించి కిరణ్ చెప్పిన మాటలు వింటే మీకు కూడా కొంచెం వింతగా అనిపిస్తుంది.


విడాకుల తర్వాత తాను చాలా హ్యాపీగా ఉన్నానని ఆమె చెప్పటం విశేషం. ఇంతకీ ఆమె ఎలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో చూడండి. కిరణ్ రావు ఇటీవల ఫయే డిసౌజా షోలో కనిపించింది. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడింది. "అప్పుడప్పుడూ మీరు మీ సంబంధాన్ని మళ్లీ పునర్నిర్వచించెంకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, మనం ఎదిగే కొద్ది మనిషిగా చాలా మారిపోతాం. మనకు భిన్నమైన అంశాలు కావాలి. విడాకుల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నానని భావిస్తున్నాను. మీరు దీనిని సంతోషకరమైన విడాకులు అని పిఅనటం గమనరహంలవచ్చు" అని కిరణ్ అనడం గమనరహం.


తాను ఎందుకు సంతోషంగా ఉన్నానో కూడా వివరిస్తూ.."పెళ్లి చేసుకోకుండా చాలాకాలం ఒంటరిగా ఉన్నాను. పెళ్లికి ముందు నా జీవితాన్ని, స్వేచ్ఛను బాగా ఆస్వాదించాను. నేను అప్పుడు ఒంటరిగా ఫిలయ్యేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే నేను నా కుమారుడు ఆజాద్ తో ఉన్నాను. విడాకుల తర్వాత చాలామంది ఒంటరిగా ఫీలవుతారని నేను అనుకుంటున్నాను. కానీ అమీర్, నా కుటుంబం నుంచి నాకు పూర్తి మద్దతు లభిస్తున్నందుకు నేను ఎప్పుడూ ఆ ఒంటరితనాన్ని అనుభవించలేదు. అందుకే ఇది మంచి విషయం అని అన్నాను. ఇది ఇలా సంతోషకరమైన విడాకులు" అని చెప్పుకోచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: