రాబోతున్న స్వాతంత్ర దినోత్సవంనాడు రాబోతున్న లాంగ్ వీకెండ్ ను కార్నర్ చేయాలని ఎన్నో ఆలోచనలు చేసి తమ ‘డబల్ ఇస్మార్ట్’ ను విడుదల చేస్తున్న పూరీ జగన్నాథ్ రామ్ ల అంచనాలు సజావుగా విజయవంతం అయ్యే ఆస్కారం కనిపించడంలేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికికారణం ఈమూవీని కార్నర్ చేస్తూ విడుదల అవుతున్న అనేక సినిమాలు ‘డబల్ ఇస్మార్ట్’ ను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని పూరీ భావిస్తూ ఉంటే తమిళ టాప్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ కూడ అదేరోజు విడుదల అవుతున్న పరిస్థితులలో పూరీ పాన్ ఇండియా ఆశలు సోలో గా నెరవేరే ఆస్కారం కనిపించడంలేదు.



ఇక ఇది చాలదు అన్నట్లుగా ఈసినిమాను కార్నర్ చేస్తూ అనేక తెలుగు అదేరోజు విడుదలకబోతున్నాయి.  శ్రద్ధ కపూర్ ‘స్త్రీ 2’ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి.  అంతేకాదు అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ జాన్ అబ్రహం ‘వేదాలు’ కూడ ఈ రేస్ లో ఉండబోతున్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఇంత పోటీ ఉన్నప్పటికీ ‘డబల్ ఇస్మార్ట్ శంకర్’ కు మంచి బిజినెస్ జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి.



అయితే ఇంత పోటీని తట్టుకుని ఎంతవరకు ‘డబల్ ఇస్మార్ట్’ నిలబడి టోటల్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకోగలుగుతుంది అన్న సందేహాలు ఇండస్ట్రీలో కొందరికి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న రామ్ పూరీలకు ఈసినిమా విజయవంతం కావడం వారి కెరియర్ దృష్ట్యా చాల అవసరం. అందుకనే ఈసినిమాలోని ప్రతి సీన్ ను భారీ భారీ బిజినెస్ ఆఫర్ ను తీసుకువచ్చే విధంగా పూరీ తన టీం సభ్యులతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నాడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా రాబోయే ఆగష్టు 15న ఇన్ని సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో రామ్ ‘డబల్ ఇస్మార్ట్’ అనేక సినిమాల చక్రవ్యూహంలో చిక్కుకుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: