డిసెంబరు లో విడుదలయ్యే సినిమాల లో ప్రస్తుతాని కి రెండు సినిమాలు క్లారిటీ ఇచ్చేసాయి. ముందుగా డిసెంబరు లో వస్తున్నామని ప్రకటించారు పుష్ప -2. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబో లో వచ్చిన పుష్ప సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.దానికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప-2 ఫై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ, షూటింగ్స్ క్యాన్సిల్ అవుతూ ఆలా సాగుతూ ఉంది. ఈ నెల లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ చేయాల్సి ఉండగా అనుకోని కారణాల వలన వాయిదా పడింది. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు నిర్మాతలు. కానీ షూటింగ్ డిలే కారణం గా డిసెంబరు 6న వస్తున్నట్టు ప్రకటించారు మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ.డిసెంబర్ 20న లేదా క్రిస్మస్ కు  గేమ్ ఛేంజర్  సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించు కున్నట్లు తెలుస్తుంది.క్రిస్మస్ హాలి డేస్ తో లాంగ్ వీకెండే కలిసొస్తున్నట్లు అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి కొన్నిరోజుల ముందు అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. ఆ తరువాత కొన్నిరోజుల కు జనవరి 10న  'విశ్వంభర' సినిమా రిలీజ్ కాబోతుంది. ఇలా రెండు బడా సినిమాల రిలీజ్ మధ్యలో వస్తున్న గేమ్ ఛేంజర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ నేపథ్యం లో మరికొన్ని నెలల్లో మెగా ఫ్యాన్స్ కు సినిమాల పండుగ రానుంది అని చెప్ప వచ్చు.నెల రోజుల వ్యవధిలో మూడు పెద్ద సినిమాలు థియేటర్లోకి రానున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: