మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తోనే పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్ ఇలా అందరు వచ్చారు. అల్లు ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ని మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు తనకంటూ ఒక సెపరేట్ ఆర్మీ ఏర్పాటు చేసుకుని బన్నీ సత్తా చాటుతున్నాడు. పుష్ప 1 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ సైతం గెలిచాడు. ఐతే అల్లు ఫ్యామిలీ నుంచి మరో హీరో కూడా వచ్చాడు. అతనే అల్లు శిరీష్. అతను ఇంకా హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

చివరిగా ఊర్వశివో రాక్షిసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ లేటెస్ట్ గా బడ్డీ అంటూ కొత్త సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను సాం ఆంటోని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అసలైతే జూలై 27న రిలీజ్ చేయాల్సి ఉన్నా బజ్ లేదని ఆగష్టు 2కి వాయిదా వేశారు. 10 రోజుల్లో అల్లు శిరీష్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈసారి బడ్డీ అంటూ టెడ్డీ బేర్ తో సాహసాలు చేయించాడు అల్లు శిరీష్.

ఈ సినిమాలో బాలయ్య స్లోగన్ అయిన జై బాలయ్య అనేది పెడుతున్నారని టాక్. భగవంత్ కేసరి సినిమాలో జై బాలయ్య స్లోగన్ ని బడ్డీ సినిమాలో ఒక చోట పెడుతున్నారట. అది కచ్చితంగా సినిమాకు హెల్ప్ చేసేలా ఉంటుందని అంటున్నారు. అల్లు ఫ్యామిలీతో బాలకృష్ణ రిలేషన్ తెలిసిందే. అందుకే ఆహా కోసం అన్ స్టాపబుల్ షో చేశారు బాలయ్య బాఉ. ఆ షో సక్సెస్ అవ్వడంతో వీరి బంధం మరింత స్ట్రాంగ్ గా మారింది. అందుకే అల్లు శిరీష్ సినిమాలో కూడా బాలయ్య స్లోగన్ ని వాడేసినట్టు తెలుస్తుంది. మరి అల్లు శిరీష్ కు ఈ బడ్డీ అయినా హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: