సినీ సెలెబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా.. అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఎంతగానో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ల ప్రేమయనాలు పెళ్లిళ్లు అనేవి ఎప్పుడు తెరమీదకి వచ్చిన వైరల్ గా మారిపోయి ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.



 అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా అటు సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోవడంతో.. ఎంతోమంది హీరో హీరోయిన్లు తమ ప్రేమాయనాల గురించి రహస్యంగా ఉంచుకోవడం కాదు అభిమానులు అందరితో కూడా అన్ని విషయాలను పంచుకోవడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా తన ప్రేమాయణం గురించి ఒక షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది. తాను తన బాయ్ ఫ్రెండ్ కి ప్రతి నెల బ్రేకప్ చెప్పే దాన్ని అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పింది జాన్వి కపూర్.


 అప్పట్లో మూడ్ స్వింగ్స్ లాంటి సమస్యతో బాధపడుతూ ఉండేదాన్ని. ఇక ఆ సమయంలో బాయ్ ఫ్రెండ్ కి ప్రతి నెల బ్రేకప్ చెప్పే దాన్ని అంటూ హీరోయిన్ జాన్వి కపూర్ తెలిపింది. ఇటీవలే ఉలజ్ ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. బ్రేకప్ చెప్పాక మళ్ళీ రెండు రోజుల తర్వాత నేనే నా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి సారీ చెప్పే దాన్ని. తొలత బ్రేకప్ చెప్పగానే అతను షాక్ అయ్యాడు. కానీ రాను రాను నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అంటూ పేర్కొంది. కాగా ప్రస్తుతం జాన్వికపూర్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: