తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు కుటుంబంలో నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో అల్లు శిరీష్ కూడా ఒకరు.. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలను నటించిన సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అందుకే సినిమా కథలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అల్లు శిరీష్.. తాజాగా తను నటిస్తున్న బడ్డీ అనే యాక్షన్ , రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధమైంది. దీంతో ఈ సినిమా టీజర్ ట్రైలర్ సాంగ్స్ సినిమా పైన అందరిని ఆసక్తి కలిగించేలా చేస్తున్నాయి.


తాజాగా బడ్డి సినిమాకు సంబంధించి వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో బాలకృష్ణ రిఫరెన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది.. ఒక యాక్షన్ సీక్వెల్స్ లో జై బాలయ్య అనే స్లోగస్ వినిపిస్తోందట.. అలాగే భగవంతు కేసరి థీమ్ మ్యూజిక్ తో వచ్చే ఈ సన్నివేశం ప్రేక్షకులకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది అంటూ చిత్ర బృందం తెలియజేస్తోంది. మెగా ఫ్యామిలీ హీరో సినిమాలలో బాలయ్య రిఫరెన్స్ ఉండడం అభిమానులను కాస్త ఆకర్షించేలా కనిపించిన ఒకవేళ ఇది నిజమైతే కచ్చితంగా థియేటర్లో దద్దరిల్లడం ఖాయం అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


మెగా ఫ్యామిలీలో బాలకృష్ణకు చాలా ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉన్నది. ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆహా ఓటీటీ లో ఒక టాక్ షోని చేసి బాలయ్యలు మరోక  యాంగిల్ని బయటకు తీసి సక్సెస్ అందుకున్నారు... దీంతో అటు మెగా నందమూరి కుటుంబం మధ్య మరింత బాండింగ్ ఏర్పడడానికి కారణమైంది. ఇక స్టైలిష్ స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ కూడా బాలకృష్ణతో కలిసి పలు సందర్భాలలో ఒకే వేదిక మీద కనిపించారు. ఇప్పుడు అల్లు శిరీష్ నటిస్తున్న బడ్డీ సినిమాలో కూడా  బాలయ్య స్లాగ్ వినిపించడం మరి ఈ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.. చివరిగా అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివ అనే సినిమాలో నటించారు.ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య గెస్ట్ గా వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: