బాలీవుడ్ బ్యూటీ అండ్ అతిలోక సుందరి కూతురు అయినటువంటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ బ్యూటీ ప్రెసెంట్ వరస చిత్రాలతో దూసుకుపోతుంది . ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఈమె దీంతో పాటు మరో రెండు మూడు చిత్రాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే ‌. అయితే జాన్వి నటిస్తున్న తాజా చిత్రం ఉలఝ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది . ఇక ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జాన్వి కపూర్ సోషల్ మీడియా వేదికగా స్టార్ కిడ్స్ పై వస్తున్న విమర్శలపై స్పందించింది .


బ్యూటీ మాట్లాడుతూ ... " సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు . ఎందుకంటే వాటి కల్చర్ అదే కాబట్టి  . మనం పబ్లిక్ ఫిగర్ అయినా కాకపోయినా ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి . కాబట్టి అలాంటి విమర్శలకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పనిలేదు . ఒక ఇష్యూ పై ఈరోజు పొగిడిన వాళ్ళు ‌‌.. అదే ఇష్యూ పై రేపటి రోజున తిడతాడు ‌. అందుకే అవన్నీ పట్టించుకోకూడదు " అంటూ కామెంట్స్ చేసింది జాన్వి కపూర్ .


ప్రస్తుతం జాహ్నవి కపూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి . ఇక జాన్వి వ్యాఖ్యలను చూసిన పలువురు .. " సరిగ్గా చెప్పారు మేడం . ప్రజెంట్ ఉన్న జనరేషన్ మొత్తం సోషల్ మీడియా లో బాగా హడావిడి చేస్తున్నారు . ఎటువంటి రీల్ కి అయినా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ వారిని నెగటివ్ చేస్తున్నారు . ఇది ఒక సెలబ్రిటీస్ విషయంలోనే కాదు యూట్యూబ్ బర్డ్స్ విషయంలో కూడా జరుగుతుంది . మీరు ఇలా స్పందించడం అక్షరాల కరెక్ట్ " అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: