సినిమాలు విడుదల అయితే ఒకే సారి దండయాత్రల థియేటర్ల పైకి పడుతూ ఉంటాయి. ఇక సినిమాలు లేవు అంటే థియేటర్లు మూతపడే స్థాయిలో ఏ సినిమా కూడా విడుదల కావు. ఇక ఆగస్టు 15 వ రోజు థియేటర్ల పైకి అనేక సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? వాటిలో ఏ మూవీ లపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

డబల్ ఇస్మార్ట్ : రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ సినిమాలో కావ్య దాపర్ హీరోయిన్ గా నటించగా ... పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేనున్నట్లు మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మిస్టర్ బచ్చన్ : మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా ప్రకటించింది. రవితేజ , హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఆయ్ : ఎన్టీఆర్ బావమరిది నార్నీ నితిన్ హీరోగా రూపొందిన ఈ మూవీ ని కూడా ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

35 మూవీ : ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు.

తాంగలం : విక్రమ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: