తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో అక్కినేని అఖిల్ ఒకరు. ఇకపోతే ఈయన వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే మూవీ తో హీరో గా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేక పోయింది. ఇకపోతే ఈ సినిమా అపజాయన్ని అందుకున్న ఇందులోని ఒక సన్నివేశం అద్భుతంగా రావడం కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడట.

ఆ సన్నివేశం ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాలో హీరోయిన్ పెదాలపై ఉన్న ఐ స్క్రీమ్ లో అఖిల్ తీసుకోవాల్సిన ఒక సన్నివేశం ఉంటుంది. ఇకపోతే ఈ సన్నివేశం ఫర్ఫెక్ట్ గా రావడం కోసం అఖిల్ చాలా కష్టపడ్డట్లు , అందుకోసం ఏకంగా 16 టెక్ లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చివరిగా ఈ టెక్ అద్భుతంగా వచ్చిందట. ఇలా ఈ మూవీ లోని ఒకే ఒక సన్నివేశం కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడట. ఈ మూవీ లో అఖిల్ కి జోడిగా సయేషా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది.

ఇకపోతే ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని సాధించకపోవడంతో ఈమెకు కూడా భారీ స్థాయిలో గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించలేదు. ఇక అఖిల్ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఆయన ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు అని తెలుస్తుంది. అఖిల్ ఆఖరుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. బారి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: