హీరోయిన్ శ్రద్ధదాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్ కి సక్సెస్ వెంటనే రాదు కొంతమంది ఇక్కడ త్వరగా సెటిల్ అవుతారు మరికొందరు చాలా కష్టపడితే తప్ప అక్కడ సెటిల్ కాలేరు. ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ శ్రద్ధదాస్ కథ కూడా అంతే. 2008లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కి ఇంతవరకు సరయిన గుర్తింపు రాలేదు.


హీరోయిన్ గా కొనసాగుతుందని అనుకున్నారు కానీ, సహాయ నటిగా చేస్తుంది. అల్లు అర్జున్, వెంకటేష్, ప్రభాస్ సినిమాల్లో సెకండ్ లీడ్ గా చేసింది అయినా ఆమెకి మాత్రం ఎలాంటి క్రెజ్ రాలేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ మూవీస్ లో నటించినది. ఇటీవల పారిజాత పర్వం అనే మూవీలో మెరిసింది. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈమెకు సమయం కుదిరినప్పుడల్లా ఫోటో షూట్స్ చేసి పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా, ఈ అందాల తార షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రద్ధదాస్ కట్టెల పోయ్యి పై రొట్టెలు చేస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి.


దీనికి సంబంధించిన ఫొటోస్ ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. వీటిపై స్పందించిన ఫ్యాన్స్, నెటిజెన్ల పోయ్యి దగ్గర ఫోటో ఫోజులకు ఎందుకు అంతలా కష్టపడటం అయినా మోడ్రన్ డ్రెస్ వేసుకుని అక్కడ ఎందుకు కూర్చోన్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా కామెడీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: