బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలు నటించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకు. తాజాగా దేవర మూవీలో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో మరో మూవీ చేయబోతున్న సంగతి కూడా తెలిసింది. జాన్వి కపూర్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటుడు గుల్లన్ దేవయ్య స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదని మాత్రమే తాను అన్నానని తెలిపారు. జాన్వి మంచి నటి అని ఆయన చెప్పారు. సుధాన్షు సరియా దర్శకత్వంలో తరికెక్కుతున్న చిత్రం ఉలర్. ఈ సినిమాలో జాహ్నవి కపూర్, గుల్లన్ దేవయ్య నటించారు.


ఆగస్టు 2న ఉలర్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇద్దరూ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తాజాగా గుల్లన దేవయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..'జాన్వి కపూర్ తో నాకు ఫ్రెండ్లి రిలేషన్ లేదు. సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే నాతో మాట్లాడేది' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గుల్షన్ పై ట్రోల్స్ రావడంతో ఆయన స్పందించారు.'జాన్వి కపూర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదు అని అన్నాను. అది మా ఇద్దరి తప్పు కాదు. జాన్వి మంచి నటి. చాలా ప్రోఫెషనల్ గా నటిస్తారు. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి' గుల్షన్ అన్నారు. ' చేసే ప్రతి సినిమా సెట్ లోనూ చిత్ర యూనిట్ అంతా ఓ కుటుంబంలో కలిసిపోవాలని నిబంధన లేదు.


నేను ఎవరిని కించపరచడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. సినిమా కోసం నేను, జాన్వి వందశాతం కష్టపడ్డాం. డైరెక్టర్ చెప్పినట్లు చేశాం. నేను చాలా మంది హీరోయిన్స్ తో నటీంచా. వారితో నాకు మంచి స్నేహం ఉంది. రాధిక ఆప్టే, సోనాక్ష సిన్హాలతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. మేము సెట్ లో ఎన్నో విషయాలు చర్చించుకునే వాళ్లం. జాన్వి తో మాత్రం సినిమా గురించి మాత్రమే చర్చించా. అదే విషయాన్ని ఇంటర్వ్యూలో తెలిపా. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి' అన్ని గుల్షన్ దేవయ్యా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: