దేవి వారశురాలుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అక్కడ చెప్పుకో తగ్గ స్థాయిలో సక్సస్ అందుకోలేకపోవడంతో ప్రస్తుతం ఆమె దృష్టి అంతా టాలీవుడ్ పై ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ లో నటిస్తున్న ఈమె రామ్ చరణ్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో కూడ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా నానితో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడ ఈమె నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.



జాన్వీ లేటెస్ట్ గా బాలీవుడ్ లో నటించిన ‘ఉలజ్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ‘దేవరా’ విషయాలను బయటపెట్టింది. ‘దేవర’ పార్ట్ వన్ లో తన పాత్ర చాల సరదాగా బీచ్ ఒడ్డున ఆడుతూపాడుతూ కాలం గడిపే అమ్మాయిగా మాత్రమే కనపడుతుందని తన అసలు పాత్ర ఈ మూవీ సెకండ్ పార్ట్ లో మాత్రమే ఉంటుందని లీకులు ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ పూర్తి అయిందని ఆ రెండు పాటలలో తాను జూనియర్ తో స్టెప్స్ వేసేడప్పుడు తాను చాల కష్టపడవలసి వచ్చింది అంటూ తారక్ పై ప్రశంసలు కురిపించించింది.



‘దేవర’ పార్ట్ 2 లో తన పాత్ర ఈమూవీ కథకు మలుపు తిప్పే పాత్రగా మారుతుందని అంటూ తాను ‘దేవర 2’ షూటింగ్ కోసం అనుసరిస్తున్న వ్యూహాలను వివరించింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ దర్శకుడు బిజీగా ఉండే పరిస్థితులలో జాన్వీ ఇప్పుడు పనికట్టుకుని ‘దేవర’ పై అంచనాలు పెంచడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కోసం తారక్ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తుంటే ఈ మూవీసెప్టెంబర్ లో విడుదల ఉంటుంటుంది అన్న లీకులు బయటకు రావడంతో ఈ మూవీ ఫలితం గురించి జాన్వీ గంపేడు ఆశలు పెట్టుకుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: