మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఐతే చిరంజీవి రీ ఎంట్రీ టైం లో చరణ్ బ్రూస్ లీ సినిమాలో చిన్న క్యామియో ఇచ్చారు. ఆ తర్వాత చిరు ఖైదీ నెంబర్ 150లో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ లో చరణ్ క్యామియో తెలిసిందే. ఆ జోష్ తోనే చిరు చరణ్ కలిసి ఆచార్య తీశారు. కథ కుదరలేదో.. కాన్సెప్ట్ ఎక్కలేదో కానీ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది.

మరోసారి చిరు, చరణ్ కలిసి నటించాలన్న ఆలోచన కూడా రాకుండా ఆ సినిమా ఫలితం భయపెట్టింది. ఐతే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమాతో మరోసారి అలాంటి ప్రయోగం చేస్తున్నారని తెలుస్తుంది. చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమా గ్లోబల్ వైడ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవిని కూడా ఒక క్యామియో ఇప్పించాలని డైరెక్టర్ బుచ్చి బాబు ప్రయత్నిస్తున్నాడు. ఐతే అది నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

ఐతే మెగా ఫ్యాన్స్ మాత్రం క్యామియోనే కాబట్టి చిరు ఎలివేషన్స్ కి బాగుంటాయని సూపర్ అనేస్తున్నారు. చరణ్ 16వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. చరణ్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకుంటాడని అంటున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ టైటిల్ నే దాదాపు ఓకే చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. సో మెగా చరణ్ కాంబో మరోసారి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనుందని చెప్పొచ్చు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే భారీ హైప్ తెచ్చుకుంటుంది. ఈ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: