మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ పై చేస్తున్న ట్రోల్స్ గురించి హైపర్ ఆది స్పందించారు. శివం భజే ట్రైలర్ రిలీజ్ లో పాల్గొన్న హైపర్ ఆది అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ విన్నర్ అని ఆయన్ను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఆపేయాలని అన్నారు. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకటే అని వాళ్లకి ఇది నచ్చదని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ పై ట్రోల్స్ గురించి మెగా అభిమానిగా స్పందించాడు హైపర్ ఆది.

ఆయన నేషనల్ అవార్డ్ తెచ్చిన హీరో అని.. వాళ్లంతా బాగానే ఉంటారు ఫ్యాన్స్ ట్రోల్ చేయొద్ధని చెప్పాడు. ఐతే హైపర్ ఆది ఈ విషయంపై మాట్లాడటం అనవసరమైన రచ్చకు దారి తీస్తుందని చెప్పొచ్చు. సైలెంట్ గా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్ పై ఒక కమెడియన్ స్పందించడం వల్ల అది మెయిన్ స్ట్రీం ఇష్యూగా మారుతుంది.

హైపర్ ఆది చెప్పింది మంచికే అనిపిస్తున్నా విషయం అందరు విని వదిలేసినట్టే వదిలేస్తే బాగుండేది. హైపర్ ఆది పిలుపునిచ్చాడు కదా అని అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఆపేస్తారా.. అలా కాదు కానీ తన వంతు ప్రయత్నంగా మెగా ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు హైపర్ ఆది. అయితే ఆది కామెంట్స్ ని మెగా ఫ్యాన్స్ ఎంత సీరియస్ గా తీసుకుంటారన్నది చూడాలి. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీస్ ఫైట్ పక్కన పెడితే ఈ ఫ్యాన్ వార్ తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. మొన్న బన్నీ వాసు ఫ్యామిలీ కలిసేందుకు ఒక సందర్భం కోసం చూస్తున్నాయని అనగా.. ఇప్పుడు హైపర్ ఆది అల్లు అర్జున్ ని ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కి చెబుతున్నాడు. ఐతే మెగా ఫ్యాన్స్ మాత్రం వీళ్ల మాటలు చెవికి ఎక్కించుకోవట్లేదు. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: