టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు నాని సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా వచ్చే దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయింది.  తాజాగా ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు రెండున ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీని రి రిలీజ్ చేస్తారట. నాని హీరోగా,, సమంత హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఇళయరాజా అందించారు. తమిళంలో “నీదానే ఎన్ పొన్వసంతం’ గా ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా రూపొందింది.

 అందులో తమిళ నటుడు జీవా నాని నటించిన వరుణ్ పాత్రను పొషించగా, నిత్య పాత్రను సమంత పొషించింది. ఇక లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.ఈ మూవీ లోని నాని , సమంత నటనలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే వీరిద్దరి మధ్య ఈ సినిమాలో కెమిస్ట్రీ కి కూడా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్

 చేయనున్నారు.  ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది రిలీజైన ఖుషి తర్వాత సినిమాలకు దాదాపు పది నెలలకుపైనే గ్యాప్ తీసుకున్నది సమంత. ఇటీవలే ఆమె కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టినట్లు సమాచారం. తన బర్త్‌డే రోజు మా ఇంటి బంగారం పేరుతో ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీని అనౌన్స్‌చేసింది. మెడలో తాళిబొట్టుతో చేతిలో గన్ పట్టుకొని రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పేరుతో ఓన్ ప్రొడక్షన్ హౌజ్‌ను నెలకొల్పిన సమంత ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా మా ఇంటి బంగారం మూవీని నిర్మిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: