అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. పుష్ప సినిమా కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని సుకుమార్ సమయం తీసుకుని మరీ అద్భుతంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పార్ట్ 2 ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ ఈమధ్య కాలంలో పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీటికి ఫుల్స్ టాప్ పెట్టారు డైరెక్టర్ సుకుమార్.భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ 2021 డిసెంబర్ 17న రిలీజై సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ పుష్ప పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. 2024 ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ, అనుకోని విధంగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్ట్ కావడంతో అనుకున్న సమయంలో మూవీ విడుదల కాకపోవచ్చనే వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. దీనిపై తాజాగా చిత్ర బృందం స్పందించింది. ‘పుష్ప 2 రిలీజ్ పోస్ట్ పోన్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ముందుగా ప్రకటించిన తేదీలోనే అంటే.. 2024 ఆగస్టు 15న పుష్ప గాడు థీయేటర్‌లో కనిపిస్తాడని’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఇక ఈ విషయంపై మరోసారి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు సుకుమార్. “Pushpa Rule Begins In 200 Days”అంటూ పోస్టర్ ను విడుదల చేసారు. దీంతో వాయిదాపై అభిమానుల్లో క్లారిటీ వచ్చింది. సుకుమార్ చేసిన ఈ పోస్ట్ పుష్ప2 పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: