పూరీ జగన్నాథ్ రామ్ కాంబోలో రెండో సారి తమ మ్యాడ్ నెస్ చూపించేందుకు వస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరోసారి డబుల్ ఇస్మార్ట్ తో పూరీ రామ్ కలిసి వస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్ తెస్తున్నాయి. సినిమా మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఐతే డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఆగష్టు 15కి రిలీజ్ లాక్ చేయగా అందుతున్న సమాచారం ప్రకారం రిలీజ్ కు ముందే సినిమా ప్రీమియర్స్ వేస్తారని తెలుస్తుంది.

పెయిడ్ ప్రీమియర్స్ గా డబుల్ ఇస్మార్ట్ ను ఒకరోజు ముందే ప్రేక్షకులకు వేస్తారట. కొన్ని స్పెషల్ స్క్రీన్స్ సెలెక్ట్ చేసుకుని ఈ ప్రీమియర్స్ వేస్తారని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో అటు పూరీ ఇటు రామ్ ఇద్దరు సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా మరోసారి వాళ్లిద్దరికి హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆగష్టు 15న ఆడియన్స్ కు మాస్ మసాలా ట్రీట్ అందించేలా ఈ మూవీ వస్తుంది. డబుల్ ఇస్మార్ట్ తో హిట్ పడితే మాత్రం పూరీ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. లైగర్ ఫ్లాప్ తో డీలా పడ్డ పూరీ ఈసారి భారీ హిట్ కు టార్గెట్ పెట్టుకున్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా చేస్తుండగా కె.జి.ఎఫ్ విలన్ కాబట్టి రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ నాడే రవితేజ మిస్టర్ బచ్చన్ వస్తుంది. ఐతే ఈ సినిమాలు రెండు కూడా మాస్ థీం తో రావడం ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. మరి ఆరోజు ఏ సినిమాది పై చేయి అవుతుంది అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: