టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్ ఇద్దరు కలిసి నిర్మించారు. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా ... సంజయ్ దత్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను అమ్మి వేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్రపంచ వ్యాప్త ఐదు భాషల థియేటర్ హక్కులను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ పై నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. ఇకపోతే ఈయన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా యొక్క ఐదు భాషల థియేటర్ హక్కులను ఏకంగా 60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇలా నిరంజన్ రెడ్డిమూవీ యొక్క ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. మరి ఈ మధ్య కాలంలో రామ్ హీరోగా రూపొందిన ది వారియర్ , స్కంద మూవీ లకు భారీ బిజినెస్ లు జరిగాయి. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ మూవీ కి భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కూడా బోల్తా కొట్టింది. మరి డబల్ ఇస్మార్ట్ మూవీతో నిరంజన్ రెడ్డి కి లాభాలు వస్తాయా ... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: