బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో చివరగా వచ్చిన అఖండ సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమా సీక్వెల్ గా అఖండ 2 ని త్వరలో సెట్స్ మీదకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అఖండ సినిమాకు థమన్ ఇచ్చిన బిజిఎం ఒక రేంజ్ లో వర్క్ అవుట్ అయ్యింది. స్పీకర్లు బద్ధలు అయ్యేలా థమన్ అఖండ మ్యూజిక్ వినిపించింది. అయితే అఖండ 2 సినిమాకు బోయపాటి శ్రీను థమన్ ని పక్కన పెడుతున్నాడని తెలుస్తుంది. అదేంటి అంటే బోయపాటికి థమన్ మధ్య ఏదో గొడవ జరిగిందని అంటున్నారు.

స్కంద సినిమా టైం లోనే థమన్ తో బోయపాటి శ్రీను రుసరుసలాడాడని టాక్. ఇప్పుడు అదే కోపంతో అఖండ 2 నుంచి కూడా ఆయన్ను తప్పించారని తెలుస్తుంది. థమన్ బ్యాక్ గ్రౌడ్ స్కో వల్లే అఖండ కు భారీ హైప్ వచ్చింది. మర్ సీక్వెల్ లో అతను కాకుండా మరెవరు చేస్తాడు అంటే థమన్ బదులుగా యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో చేయిస్తారని తెలుస్తుంది.

అఖండ 2 లాంటి సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అందుకే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. థమన్ అయితేనే ఈ సినిమాకు న్యాయం చేస్తాడని అనుకుంటే ఇప్పుడు ఆయన ప్లేస్ లో మరొకరు మ్యూజిక్ అందించబోతున్నారు. బోయపాటి బాలయ్య సినిమా అంటే అది పక్కా హిట్ అన్నట్టే లెక్క. మరి ఆలకృష్ణ అఖండ 2 కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ మార్పు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2025 సంక్రాంతికి వస్తుందని టాక్. అఖండ 2 ని డిసెంబర్ లో మొదలు పెట్టి కుదిరితే 2025 సమ్మర్ లేదా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: