తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే నేరుగా ఇప్పటి వరకు అజిత్ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయిన తాను నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే తాజాగా ఈ నటుడికి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... కే జి ఎఫ్ సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ హీరో గా రెండు మూవీ లను చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. ఇకపోతే అజిత్ హీరోగా ప్రశాంత్ నిల్ రెండు మూవీ లను చేయబోతున్నట్లు అవి కూడా ఒక దాని తర్వాత ఒకటి ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన అజిత్ హీరోగా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన ప్రశాంత్ దర్శకత్వంలో రెండు మూవీ లు  రూపొందబోతున్నట్లు వార్తలు రావడంతో అజిత్ అభిమానులు ఆనంద పడుతున్నారు.

ఇకపోతే ప్రశాంత్ ఆఖరుగా ప్రభాస్ హీరోగా సలార్ పార్ట్ 1 ను రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం సలార్ పార్ట్ 2 మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ హీరో గా కూడా ఓ మూవీ ని అనౌన్స్ చేసి ఉన్నాడు. మరి అజిత్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కించబోయే సినిమా ఎన్టీఆర్ మూవీ తర్వాత ఉంటుందా ... ముందే ఉంటుందా అనే దానిపై పెద్దగా క్లారిటీ రావడం లేదు. ఒక వేళ అజిత్ తో మూవీ ముందే ఉంటే ఎన్టీఆర్ సినిమా డిలే అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: