తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో మాస్ మహారాజా ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. కాకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ కు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

సినిమా తర్వాత ఈయన నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులను అమ్మివెస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ కి సంబంధించిన డిజిటల్ హక్కులను కూడా ఈ మూవీ బృందం అమ్మి వేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ అత్యంత భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ విడుదల అయిన కొన్ని వారాల తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: