మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించగా ... జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈయన పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువగానే ఉన్నప్పటికీ సినిమా కథను మొత్తం మలుపు తిప్పే పాత్రలో ఈయన ఈ మూవీ లో కనిపించబోతున్నట్లు , అలాగే ఈ సినిమాలో సిద్దు కనిపించబోయే విషయాన్ని కూడా మరికొన్ని రోజుల్లో ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే సిద్దు ఇప్పటికే డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ విజయాలతో తెలుగులో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ యువ నటుడు మిస్టర్ బచ్చన్ సినిమాలో నిజం గానే గెస్ట్ రోల్ లో నటించినట్లు అయితే ఈ మూవీ పై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి సిద్దు నిజంగానే ఈ సినిమాలో నటించాడా ... లేక ఇదంతా రూమరా అనేది తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: