సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడుతో లేదా నటితో అనుకున్న సినిమాను వేరే వారితో తెరకెక్కించడం అనేది చాలా సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక అలా మొదట ఒక నటిని లేదా నటుడిని అనుకొని ఆ సినిమా కోసం వారిని సంప్రదించిన సమయంలో వారు కనక ఆ టైమ్ లో సినిమా కథ నచ్చకనో , లేక ఆ సినిమా కోసం తేదీలను అడ్జస్ట్ చేయలేకనో , మరే కారణాల వల్లనో ఆ మూవీ ను కనుక రిజెక్ట్ చేసినట్లు అయితే అదే సినిమా వేరే వారితో తెరకెక్కి మంచి విజయం సాధిస్తే అయ్యో ఆ సినిమాను ఎందుకు వదులుకున్నామా అని బాధపడుతూ ఉంటారు. ఇక ఆ సినిమా కనుక బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడితే ఆ రోజు ఆ సినిమా చేయకపోవడం చాలా మంచిది అయింది అని ఆనంద పడుతూ ఉంటారు.

ఇక ఏదేమైనా కూడా సినిమా ఇండస్ట్రీ లో ఒకరితో అనుకున్న సినిమాలు మరొక్కరితో తెరకెక్కిన సందర్భాలు చాలా ఎక్కువ గానే జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఓ బ్లాక్ బస్టర్ మూవీ లో మొదట రాశి ఖన్నా ను హీరోయిన్ గా అనుకోగా ఆ తర్వాత ఆ సినిమాలోకి అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రాక్షసుడు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

సినిమా ద్వారా అనుపమ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ గా అనుపమ ను కాకుండా రాసి కన్నా ను అనుకున్నారట. అందులో భాగంగా ఈమెకు కథను కూడా వివరించారట. కాకపోతే ఆ సమయంలో ఈమె వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో ఈ ఆఫర్ అనుపమ కు వెళ్లడం , ఈమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలా రాసి కన్నా ను హీరోయిన్ గా అనుకున్న బ్లాక్ బాస్టర్ రాక్షసుడు మూవీ లోకి అనుపమ ఎంట్రీ ఇచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: