కొన్ని సంవత్సరాల క్రితం యాంకర్లు ఎక్కువ శాతం బుల్లి తెరకే పరిమితం అయ్యేవారు. ఉదయభాను లాంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న యాంకర్లు ఒకటి , రెండు సినిమాలలో నటించిన వారికి కూడా సినిమాల్లో భారీ క్రేజీ ఆఫర్లు దక్కలేదు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ఈ మధ్య కాలంలో ఎవరైనా సినిమాలలో సరైన అవకాశాలు  దక్కడం లేదు అంటే యాంకరింగ్ రంగం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ సక్సెస్ అయ్యి సినిమాలలో అద్భుతమైన అవకాశాలను దర్శించుకుంటున్నారు. అలాంటి వారికి ఉదాహరణ అనసూయ , రేష్మి గౌతమ్ , శ్రీముఖి. వీరు ముగ్గురు కూడా యాంకరింగ్ రంగం ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు.

ఇకపోతే ఈ ముగ్గురిలో అనసూయ మాత్రం స్టార్ నటిమణులకు పోటీగా అవకాశాలను దక్కించుకుంటుంది. రేష్మి గౌతమ్ , శ్రీ ముఖి ... అనసూయ స్థాయిలో సినిమా అవకాశాలను దక్కించుకోలేకపోయినా పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్నారు. రేష్మి టీవీ షో లలో కాస్త సింపుల్ కనిపించిన వెండి తెరపై మాత్రం తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉంటుంది. ఇక వీరు ముగ్గురు కూడా ఇటు బుల్లి తెర అటు వెండితెర రెండిటి ద్వారా ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు.

\కానీ ఈ ముగ్గురిలో అనసూయ మాత్రం కాస్త ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటుంది. ఈమె ఇప్పటికే విన్నర్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. ఇక పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా పవన్ కళ్యాణ్ తో కూడా నటించినట్లు ఆయనతో ఒక స్టెప్ కూడా వేసినట్లు చెప్పింది. ఇలా శ్రీ ముఖి , రష్మి కి కూడా దక్కని అవకాశాలను అనసూయ దక్కించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: