మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో గొప్ప టాలెంట్ ఉన్న ఎంతో మంది కి ఎన్నో విలువైన బహుమతులను ఇస్తూ ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చిరంజీవి కొన్ని సందర్భాలలో కోట్ల ఖరీదైన బహుమతులను కూడా కొంత మంది కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. కృష్ణ వంశీ , చిరంజీవి కాంబోలో సినిమా రాలేదు కానీ విరి కాంబోలో కొన్ని యాడ్స్ మాత్రం తెరకెక్కయి. ఇకపోతే కృష్ణ వంశీ , చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ లో భాగంగా కృష్ణ వంశీ , చిరంజీవి గారి గురించి చెబుతూ ... చిరంజీవి గారితో ఒక యాడ్ షూట్ చేశాను. ఇక చిరంజీవి గారితో ఒక యాడ్ షూట్ చేసే సమయంలో వారు దాదాపు కోటి కంటే ఎక్కువ ధర కలిగిన ఒక కారును ఆ షూటింగ్ దగ్గరికి వేసుకోవచ్చాడు. ఇక చిరంజీవి గారు ఆరోజు వేసుకొచ్చిన ఇలాంటి కార్లు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇక షూట్ మధ్య గ్యాప్ లో చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి అన్నయ్య మీరు ఈ రోజు వేసుకొచ్చిన కారు సూపర్ గా ఉంది. మీ దగ్గర చాలా కార్స్ ఉండి ఉంటాయి.

నాకు ఇది ఇచ్చేయండి. నాకు ఇలాంటి కార్లు అంటే చాలా ఇష్టం అని అన్నాను. ఇక ఆ తర్వాత షూట్ అయిపోయింది. ఒక వారం తర్వాత చిరంజీవి గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెళ్లాను ... వెళ్లాక ఈ కార్ తీసుకో నీకు నచ్చింది అన్నావు కదా ఉంచుకో అన్నాడు. నేను షాక్ అయ్యాను ... నేను సరదాగా అన్నాను అన్నయ్య అని అన్నాను. లేదు నేను సీరియస్ గానే తీసుకున్నాను. నా దగ్గర చాలా కార్లు ఉన్నాయి. ఈ కారు నువ్వు వాడుకో అని చిరంజీవి అన్నాడు అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: