చాలా మంది సెలబ్రెటీలు ఈ మధ్యకాలంలో ప్రేమించుకొని మరి వివాహం చేసుకుంటున్నారు.. మరి కొంతమంది వివాహానికి చేసుకోవడానికి ముందు ఎన్నో రంగాలలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తే భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. హీరోయిన్ల రెమ్యూనరేషన్ విషయంలో హీరోలను వెనక్కి నెట్టి మరి స్టార్ హీరోయిన్ల రెమ్యూనరేషన్కు మించి మరి తీసుకుంటున్న వారిలోనే కాకుండా తన భర్త కంటే భారీగా సంపాదిస్తోంది హీరోయిన్ ఐశ్వర్యరాయ్.. బచ్చన్ ఫ్యామిలీకి కోడలుగా జరిగిన ఈమె అభిషేక్ భార్యగా కూడా సినిమాలలో నటించింది.


గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విడాకుల రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ ముందు ఉందట. ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపిక పదుకొనే, కరీనా, నయనతార ,కత్రినా కైఫ్ వంటి హీరోయిన్స్ సైతం ఈ రిచెస్ట్ యాక్ట్రెస్ లిస్టులో కూడా ఉన్నారు. కానీ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ మాత్రం హీరోయిన్లను మించి మరి సంపాదనలు ముందుకు వెళుతోందట. ఐశ్వర్య రాయ్ ఆస్తి ప్రస్తుతం 900 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.


ఆమె తర్వాత స్థానం ప్రియాంక చోప్రా దగ్గర 700 కోట్లు.. ఆ తర్వాత స్థానం ఆలియా భట్.. 600 కోట్లు ఉన్నట్లు సమాచారం.ఆ తర్వాత స్థానం దీపికా పదుకొనే 500 కోట్లు.. కరీనాకపూర్ 485 కోట్ల రూపాయలు.. కత్రినా కైఫ్ 300 కోట్లు.. కోలీవుడ్లో సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార కూడా 200 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే అందరికంటే ముందు నుంచి సంపాదన మీద ఐశ్వర్య దృష్టి పెట్టిందని చెప్పవచ్చు.. 1994లో మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ గా కూడా నిలిచింది ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత సంపన్న నటిగా కూడా పేరుపొందింది ఐశ్వర్యరాయ్. అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: