జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి చెప్పనక్కర్లేదు. ఈమె యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఎన్నో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. రంగస్థలం మూవీ లో రంగమ్మత్త పాత్రలో నటించి మంచి ఫేమస్ అయ్యింది. అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై యాంకరింగ్ కు గుడ్ బై వెండితె పై కీలక పాత్రలో మెరుస్తోంది. ముఖ్యంగా 'రంగస్థలం, పుష్ప' సినిమాల్లో తెలుగు ప్రేక్షకుల్లో అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. న్యూస్ యాంకర్ గా మొదలైన అనసూయ కెరియర్ యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐటెమ్ సాంగ్స్..ఇలా మల్టీ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకుంటోంది.


అయితే అనసూయ తాజాగా ఓ సోలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలోని జనాల్ని కుదురుగా ఉండనివ్వటం లేదు. ప్రతి శనివారం రాత్రి 9 గంటలు ప్రసారమయ్యే కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ప్రోగ్రాంలో అనసూయ చేస్తుంది. ' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సాంగ్ లో స్టేపులేశానని, ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని తెలిపింది. ఆయనతో కలిసి డాన్స్ చేయటం నాకు చాలా గర్వంగా ఉందని, మన టెలివిజన్ లో ఆ పాట మోతమోగిపొద్ది' అంటూ హాట్ యాంకర్ ఓ రేంజ్ లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పవర్ స్టార్ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు కదా..మరి ఏ సినిమాల్లో అనేది మాత్రం అనసూయ చెప్పలేదు. ఏ మూవీలో అయ్యింటుందంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగల్ గా వెయిట్ చేస్తున్నట్లు కామెంట్ వర్షం కురిపిస్తున్నారు.


ఇక రంగమత్త తో ఐటెమ్ సాంగ్ అంటే మామూలుగా ఉండదు మరి అంటూ యూత్ క్రేజీగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని మీరు కూడా తప్పకుండా చూడండి. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అనసూయ అందం గురించి చెప్పనక్కర్లేదు. చాలా అందంగా ఉండి క్యూట్ క్యూట్ వీడియోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోలు ఫొటోల్లో చాలా అందంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: