కల్కితో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాను త్వరగా పూర్తి చేసి జనవరి లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ ఆ తర్వాత హను రాఘవపుడితో సినిమా లైన్ లో ఉన్నయి. సీతారామం తర్వాత హను తో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రభాస్ కోసం ఏకంగా హిస్టరీ కథాంశాన్ని ఎంచుకున్నాడట హను రాఘవపుడి. హను ప్రభాస్ కాంబో సినిమాకు ఫౌజి టైటిల్ ప్రచారం లో ఉంది. దాదాపు అదే కన్ ఫర్మ్ అని సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమా కథ సుభాష్ చంద్ర బోస్ కాలం నాటిదని.. అందులో ఆజాద్ హిందు ఫౌజ్ ఫౌండర్ కి సంబందించిన అంశాలు ప్రస్తావిస్తారట. ఆ ఆర్గనైజేషన్ లో ఒకడిగా ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తుంది.

సో ఈ సినిమా సుభాష్ చంద్ర బోస్ ఎరా లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ప్రభాస్ సరసన పాకిస్తాన్ నటి సెలెక్ట్ అయినట్టు టాక్. మారుతితో చేస్తున్న రాజా సాబ్ పూర్తి కాగానే ప్రభాస్ ఈ సినిమానే ముందు సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నారు. హను రాఘవపుడి ప్రబహస్ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. సినిమాకు సంబందించిన అఫీషీల్ అప్డేట్ త్వరలో రానుందని తెలుస్తుంది.ఈ సినిమా నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ తో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్, ఫౌజితో పాటుగా సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: