ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్‌నే హైలైట్ చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్‌ విశ్వవ్యాప్తం అవడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు ఎంతో మంది టాలీవుడ్ హీరోలు సహాయం చేశారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. వరుసగా భారీ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోన్న ఈ బడా హీరో.. ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో వచ్చాడు. ఇది ఇప్పటికే ఎన్నో రికార్డులు కూడా సాధించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా మరో సంచలనం సృష్టించింది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలను పోషించారు.ఇప్ప‌టికే ఈ సినిమా రూ.1000 కోట్ల మైల్ స్టోన్ మార్క్ ను క్రాస్ చేసి ప‌లు కొత్త రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. 5వ వారంలోకి అడుగుపెడుతున్న క‌ల్కి ఇప్పుడు ఏకంగా రూ.1100 కోట్ల మార్క్ ను కూడా ట‌చ్ చేసింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ తాజా క‌లెక్ష‌న్స్ కు సంబంధించి ఓ స‌రికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి రిపీటెడ్ ఆడియెన్స్ వ‌స్తుండ‌టంతో ఈ మూవీ వ‌సూళ్లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది. అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ‌న్ సంగీతం అందించారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.ఈ క్రమంలో కల్కి 2898 ఏడీ మూవీ రూ.1100 కోట్లు వసూలు చేసిన ఆరో ఇండియన్ మూవీగా నిలిచింది. అయితే ఇలా రెండుసార్లు రూ.1100 కోట్ల మార్క్ దాటిన తొలి హీరో మాత్రం ప్రభాసే. గతంలో అతడు నటించిన బాహుబలి 2 కూడా ఈ మార్క్ అందుకోవడమే కాదు.. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ఇప్పటికీ రెండో స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: