ఇండియా వ్యాప్తంగా ఎన్నో భాషల సినిమాలలో నటించిన మాధవన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఇకపోతే ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఈయన కు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా మాధవన్ ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యింది.

ఇక మాధవన్ సినిమాలలో హీరో పాత్రలో మాత్రమే కాకుండా అనేక సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటించాడు. అందులో భాగంగా కొంత కాలం నాగ చైతన్య హీరో గా నీది అగర్వాల్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి అనే సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ లోని మాధవన్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ నటుడు ముంబై లో ఒక విలాసవంతమైన అత్యంత ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశాడు.

ముంబై లోని ఖరీదైన BKC ప్రాంతంలో 18 కోట్ల విలువైన అత్యంత ఖరీదుకుతో కూడిన కొత్త ఫ్లాట్‌ని మాధవన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫ్లాట్ 4182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలుస్తుంది. ముంబై లో విలాస వంతమైన ఈ భవనం తో పాటు మాధవన్ కి చెన్నై లో మరియు దుబాయ్ లో కూడా అత్యంత ఖరీదైన భవనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కూడా మాధవన్ వరుస సినిమా అవకాశాలతో అత్యంత బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: