టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. అలా చాలా సంవత్సరాలు కథ రచయితగా కెరియర్ను కొనసాగించిన అనిల్ , కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో అనిల్ రావిపూడి కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అయినా సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నిక్కెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు అనిల్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే అనిల్ రావిపూడి కమెడియన్ సప్తగిరి మంచం స్నేహితులు. కానీ వారిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఎందుకు గల కారణాలను అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశాడు. తాజాగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... సప్తగిరి నా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తాం. 

ఇకపోతే మేమిద్దరం మంచి స్నేహితులం అయిన నేను దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా అతను లేడు. దానికి ప్రధాన కారణం ... అప్పుడప్పుడు సప్తగిరి నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేసి సినిమాలో నాకేదైనా పాత్ర రాసావా ... చిన్న చిన్న పాత్ర అయితే నేను అసలు చేయను. సినిమా మొత్తం నా పాత్ర ఉంటే చెప్పు నేను చేస్తాను అంటూ ఉంటాడు. అంత పెద్ద పాత్ర ఎప్పుడు నాకు దొరకలేదు. అందుకే అతని తీసుకోలేదు. చిన్న పాత్ర అయినా చేస్తాను అంటే కచ్చితంగా చాలా సినిమాల్లో అతను ఉండేవాడు. తప్పు అతని వైపు కూడా ఉంది అనిల్ రావిపూడి తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: