బుల్లితెరపై అంతులేని గ్లామర్ తో నానా హంగామా చేస్తూ రీతూ చౌదరి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా రీతూ ఊహించని విధంగా ఎక్స్ పొజింగ్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంది.  యువతని చెడగొట్టే విధంగా బరితెగిస్తూ రీతూ చౌదరి ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. కొన్నిసార్లు ఆమె ఎక్స్పొజింగ్ ఎక్కువవడం వల్ల రీతూ చౌదరి ట్రోలింగ్ ని ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏమాత్రం టాలెంట్ లేక కేవలం ఎక్స్ పొజింగ్ మీదే ఆధారపడ్డ  రీతూ చౌదరి గతంలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా సందడి చేసేది. ముఖ్యంగా హైపర్ ఆది తో కలసి ఆమె బాగా కెమిస్ట్రీ పండించేది. వీళ్లిద్దరి మధ్య చనువు చూసి అంతా సంథింగ్ సంథింగ్ జరుగుతోంది అని అనుకున్నారు. రీతూ, హైపర్ ఆది గురించి అనేక రూమర్స్ కూడా వచ్చాయి. కానీ సడెన్ గా హైపర్ ఆది ఇంకా రీతూ చౌదరి జబర్దస్త్ మానేశారు. ప్రస్తుతం రీతూ చౌదరి బ్రతుకు తెరువు కోసం కొన్ని పనికిమాలిన షోలు చేస్తోంది. వాటిలో కిలాడీ గర్ల్స్ కిరాక్ బాయ్స్ అనే పనికిమాలిన షో ఒకటి. 


టీవల ఇంటర్వ్యూలో రీతూ చౌదరి హైపర్ ఆది గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ మానేసి ఇలాంటి షోలు చేయడానికి కారణం ఏంటని యాంకర్ ప్రశ్నించగా రీతూ చౌదరి ఓపెన్ గా కామెంట్స్ చేసింది. నేను జబర్దస్త్ మానేయడానికి కారణం హైపర్ ఆది అని చెప్పింది. హైపర్ ఆది జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోయాడు. ఇక నేనొక్కదానినే అక్కడ ఏం చేయాలని ప్రశ్నించింది. హైపర్ ఆది వెళ్ళిపోయాడు కాబట్టే తాను కూడా జబర్దస్త్ షో నుంచి వచ్చేసినట్లు రీతూ పేర్కొంది. టివి షోలు మాత్రమే చేస్తున్నారు.. సినిమా ఆఫర్స్ రావడం లేదా అని ప్రశ్నించగా.. ఇండస్ట్రీలోకి నేను జస్ట్ విజె అవుదాం అని వచ్చాను. ఈ రోజు ఇక్కడి దాకా చేరుకున్నా. చాలా షోలని చేస్తున్నా. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నా. వాటిలో కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఆఫర్స్ కోసం వెళితే ఈ అమ్మాయి బోల్డ్ గా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రలే ఇష్టంఅని అంటున్నారు. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీ. కాకపోతే సినిమాలో ఆ పాత్రకి ప్రాధాన్యత ఉండాలి అని రీతూ చౌదరి అంటోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో గురించి విమర్శించే వారిని పట్టించుకోను అని రీతూ చౌదరి పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: