టాలీవుడ్ లోకి బరువు కన్నడ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ కవి కిరణ్ కోలా కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ కన్నడ హీరోయిన్లదే డామినేషన్ కనిపిస్తుంటుంది. అనుష్క, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కృతి శెట్టి, నేహా శెట్టి..ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ను ఏలుతోన్న కన్నడ హీరోయిన్ల లిస్ట్ చాలా పెద్దగానే కనిపిస్తుంది. తాజాగా మరో కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.


సప్త సాగారాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ తెలుగులో ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా రాజావారు రాణి గారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. సప్త సాగరాలు దాటి మూవీలో నాచురల్ యాక్టింగ్ తో కన్నడ తో పాటు తెలుగు ఆడియెన్స్ ను మెప్పించింది రుక్మిణి వసంత్. ఈ మూవీలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాయి.


కన్నడ మూవీలో ఆమె యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ రవి కిరణ్ కోలా..విజయ్ మూవీ కోసం ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తోన్న 59వ సినిమా ఇది. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మె9 న ఈ మూవీ ని ఆఫిషియల్ గా ప్రకటించారు. రాయలసీమ బ్లాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొదిద్దుకుంటోన్న ఈ మూవీకి రౌడీ జనార్ధన్ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: