యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న దేవర రాబోతుంది. ఆ సినిమాతో ప్రేక్షకులకు మరోసారి తన నుంచి ఒక అద్భుతమైన సినిమా అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారని తెలిసిందే. దేవర 1 లో జాన్వి కపూర్ హీరోయిన్ గా తీసుకుంటుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఐతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా పేరు కూడా డ్రాగన్ అని పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఐతే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ టైటిల్ ని యువ హీరో ప్రదీప్ రంగనాథ్ కోసం ఫిక్స్ చేశారట. ప్రదీప్ రంగనథ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజుని హీరోయిన్ గా లాక్ చేశారట.

ఇది ఒక లవ్ స్టోరీ అని చెబుతున్నారు. ఐతే లవ్ స్టోరీకి డ్రాగన్ టైటిల్ ఎందుకు పెట్టారో అర్ధం కావట్లేదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు డ్రాగన్ అని పెడుతున్నారని ఇప్పటికే ఫ్యాన్స్ అంత ఆ టైటిల్ ని ఎన్టీఆర్ కోసమే అని ఫిక్స్ అయ్యారు. కానీ మైత్రి మేకర్స్ ఈ టైటిల్ ని ఒక యువ హీరో కోసం వాడటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు రేడియేటర్, డ్రాగన్ ఇలా సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే టైటిల్స్ అనుకుంటారు. ఆ టైటిల్స్ వేరే సినిమాలకు పెట్టేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లోనే ప్రశాంత్ నీల్ తారక్ సినిమా అనుకున్నారు. ఐతే ఆ నిర్మాణ సంస్థ డ్రాగన్ అనే టైటిల్ రిజిస్టర్ చేయడంతో అది ఎన్టీఆర్ కోసమే అనుకున్నారు. కానీ ప్రదీప్ తో తీసే సినిమాకు ఆ టైటిల్ కేటాయించడంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. ఐతే అంతకంటే పవర్ ఫుల్ టైటిల్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు పెట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: