తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన ఉయ్యాల జంపాల మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ నటుడు హీరోగా రూపొందిన సినిమా చూపిస్త మామ కూడా మంచి విజయం సాధించడంతో ఈయన క్రేజ్ తెలుగులో భారీగా పెరిగింది. కానీ ఆ తర్వాత ఈయనకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చిన అందులో చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ఈయనకు సినిమాల్లో అవకాశాలు భారీగానే వస్తున్నాయి. ఈయన కూడా ఎప్పటికప్పుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

తాజాగా ఈ నటుడు పురుషోత్తముడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఈ మూవీ ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్ సంస్థ పై డా రమేష్ తేజావత్ , ప్రకాష్ తేజావత్ లు నిర్మించారు. హాసిని సుధీర్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో ఐదు లక్షల కలెక్షన్లు రాగా , సీడెడ్ లో రెండు లక్షలు , ఉత్తరాంధ్రలో మూడు లక్షలు , ఈస్ట్ ప్లేస్ వెస్ట్ లో 3 లక్షలు , కృష్ణ ప్లస్ గుంటూరులో  4 లక్షలు , నెల్లూరులో ఒక లక్ష మొత్తంగా ఏపీ , తెలంగాణలో కలిపి 18 లక్షల కలెక్షన్లు రాగా , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో రెండు లక్షలు , ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 20 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో రేంటెడ్ పద్ధతిలోని రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. వాటి వాల్యూ 1.22 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ఇక దానితో ఈ మూవీ 1.8 కోట్ల షేర్ కలక్షన్లను రాబడితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇక ఈ మూవీ మరో 1.6 కోట్ల షేర్ కలక్షన్లను రాబడితే హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: