మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా ... హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క నైజాం హక్కులను మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది.

భారీ ధరకు ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విక్రమ్ తాజాగా తంగాలన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క నైజాం హక్కులను కూడా మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఒకే రోజు విడుదల కానున్న ఈ రెండు మూవీ ల యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది. దానితో వీరు ఈ సినిమాల యొక్క థియేటర్లను దాదాపుగా సమానంగా పంచే విధంగా ప్రాణాలికలను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చినా కూడా వాటిని సమానంగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచి వాటి ద్వారా మంచి లాభాలను పొందే ప్లాన్ ప్రకారం ఈ సినిమా యొక్క థియేటర్లను సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఈ రెండు మూవీలకు మంచి టాక్ వచ్చినట్లయితే రెండిటి ద్వారా మంచి లాభాలను పొందేందుకు మైత్రి సంస్థ చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: