టాలీవుడ్ లో హీరోగా రవితేజకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరంటే కచ్చితంగా పూరి జగన్నాథ్ పేరు వినిపిస్తుంది.. అయితే అలాంటి బాండింగ్ మధ్య రవితేజ పూరి జగన్నాథ్ మధ్య విభేదాలు తలెత్యాయ అనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా రవితేజ వైఖరి పట్ల పూరి జగన్నాథ అభిమానులు హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మరి వీరిద్దరి మధ్య గొడవ ఏంటి అసలు ఈ గొడవకి గల కారణాలు ఏంటి అనేది విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం.


హీరో రవితేజ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా ఒక్కసారిగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అగ్ర హీరోగా తీర్చిదిద్దిన డైరెక్టర్ ని రవితేజ ఇబ్బంది పెడుతున్నారా అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలే వీధి మధ్య విభేదాలకు కారణమయ్యాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా వచ్చే నెల ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.


అయితే అదే రోజున రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా రాబోతోంది.. ఇలా వీరిద్దరి మధ్య గ్యాప్ ఈ సినిమా తెచ్చిందని టాక్ వినిపిస్తున్నది.. లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాదాపుగా ఐదేళ్ల క్రిందటే మంచి సక్సెస్ అందుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల తేదీ పైన కూడా మేకర్స్ చాలా రోజుల క్రితమే అనౌన్స్మెంట్ చేశారు. కానీ హరి శంకర్ రవితేజ కాంబినేషన్లో వస్తున్న ఈ మిస్టర్ బచ్చన్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ చేయాలని భావించడంతో వివాదానికి దారి తీసినట్లుగా తెలుస్తోంది. సోలోగా డైరెక్టర్ పూరి డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాని విడుదల చేయాలనుకున్నప్పటికీ.. ఇలా రవితేజ మిస్టర్ బ్యాచ్ అంతా గట్టి పోటీ ఎదుర్కొన్నారు.. ఇలా తనకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తో రవితేజ పోటీ పడుతున్నారని తెలిసి పూరి కాస్త ఫీలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పైన రవితేజ కి ఫోన్ చేసి అడిగినా కూడా తనకేమీ తెలియదని అంత ప్రొడక్షన్ టీం నిర్ణయమే అని చెప్పేసారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: