రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మంచు మనోజ్ హీరోగా వరుస సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మంచు మనోజ్ చేసిన సినిమాలో ఆశించిన విజయం సాధించకపోవడంతో మనోజ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న మంచు మనోజ్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.తాజాగా  మరోసారి సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి  వరుస సినిమాలతో చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా ఇకపై హీరోగా కాకుండా విలన్ పాత్రలతో మనోజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇప్పటికే హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిరాయి' సినిమా లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈగల్ మూవీ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే మంచు మనోజ్ గ్లింప్స్ రిలీజ్ కాగా ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది...

ఇదిలా ఉంటే తాజాగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.మంచు మనోజ్ హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినా.. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ హీరోగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ హీరోతో సరిసమానంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాను రోహిత్ కే.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న మూడో షెడ్యూల్లో మంచు మనోజ్సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: