రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇప్పుడు తన 12వ సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్నూరి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే అలరించనుంది. ఈ సినిమాతో ఈ అందాల భామ తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఆ ప్లాన్ మారిపోయింది.

విజయ్ దేవరకొండ దీని తర్వాత మరో సినిమా ఉన్నాడు. అలానే రవి కిరణ్ కోలా అనే దర్శకుడితో ఓ మూవీకి సైన్ చేశాడు. ఈ సినిమాకు తాత్కాలికంగా 'VD14' అని పేరు పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రుక్మిణి వసంత్ కన్నడ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం రుక్మిణి వసంత్‌తో చివరి దశ చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

రుక్మిణి వసంత్ "సప్త సాగరాలు దాటి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. ఈ ముద్దుగుమ్మ అందాలకు టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ అందాల బొమ్మ విజయ్ కు జంటగా చేస్తే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌కి ఏ పాత్ర ఇస్తారో ఆమెకు చెప్పగానే, ఆ పాత్ర ఆమెకు చాలా బాగా నచ్చిందట. అందుకే ఆమె ఈ సినిమాలో నటించాలని అనుకుంటున్నారట.

VD14 అనే ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక యాక్షన్ డ్రామా. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అనే పెద్ద నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2025 లో మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది లేటుగా ప్రారంభం కానుంది. విజయ్ అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ అంతటి భారీ హిట్ అందుకోలేదు. ఆయన సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి. లైగర్ తో బిగ్గెస్ట్ ఫ్లాప్ అందుకున్న తర్వాత ఈ హీరో స్క్రిప్ట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: