ఆ తేదీన మా సినిమాని విడుదల చేయాలని మేం అసలు అనుకోలేదు. 'ఆగస్టు 15న విడుదల చేయండి.. మంచి డేట్' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అధినేత శశి మాకు పదేపదే చెప్పడం జరిగింది. ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి జగన్నాథ్కు, నాకు మధ్య మాటలుండవని నేను అనుకోను. ఆయన నాకంటే చాలా మెచ్యూర్'' అని సమాధానమిచ్చారు హరీష్ శంకర్.'అయితే ఆ సినిమా నిర్మాత ఛార్మి సోషల్ మీడియాలో మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా' అని అడగ్గా.. ''నేను ముందు ప్రకటించిన డేట్కి మరో సినిమా విడుదలవుతుంటే నాకు కూడా ఇరిటేషన్ ఉంటుంది. అందుకు నేను ఛార్మిని తప్పుపట్టను. కానీ సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వారిది. ఆమె నన్ను అన్ఫాలో అయ్యారో లేదో నేను ఇంకా చెక్ చేసుకోలేదు. దానిపై క్రియేట్ చేసిన ఓ మీమ్ ఒకటి చూశానంతే. అయితే ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోను. పరిస్థితుల ప్రభావమిది. 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' రెండూ సినిమాలు మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా'' అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.
ఆ తేదీన మా సినిమాని విడుదల చేయాలని మేం అసలు అనుకోలేదు. 'ఆగస్టు 15న విడుదల చేయండి.. మంచి డేట్' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అధినేత శశి మాకు పదేపదే చెప్పడం జరిగింది. ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి జగన్నాథ్కు, నాకు మధ్య మాటలుండవని నేను అనుకోను. ఆయన నాకంటే చాలా మెచ్యూర్'' అని సమాధానమిచ్చారు హరీష్ శంకర్.'అయితే ఆ సినిమా నిర్మాత ఛార్మి సోషల్ మీడియాలో మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా' అని అడగ్గా.. ''నేను ముందు ప్రకటించిన డేట్కి మరో సినిమా విడుదలవుతుంటే నాకు కూడా ఇరిటేషన్ ఉంటుంది. అందుకు నేను ఛార్మిని తప్పుపట్టను. కానీ సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వారిది. ఆమె నన్ను అన్ఫాలో అయ్యారో లేదో నేను ఇంకా చెక్ చేసుకోలేదు. దానిపై క్రియేట్ చేసిన ఓ మీమ్ ఒకటి చూశానంతే. అయితే ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోను. పరిస్థితుల ప్రభావమిది. 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' రెండూ సినిమాలు మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా'' అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.