ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ,టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి,ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా నుండి మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేయగా ఈ రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి.సినీ ప్రేక్షకులందరూ ఆసక్తి ఎదురుచూస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ విషయంలో కొంతకాలంగా రూమర్లు విపరీతంగా వస్తున్నాయి. ఐకాన్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయనే, అందుకే షూటింగ్ ఆగిపోయిందనే పుకార్లు వచ్చాయి. ఈ కారణంగానే సుకుమార్ అమెరికా నుంచి తిరిగి వచ్చే సమయంలో అల్లు అర్జున్ యూరప్ ట్రిప్‍కు వెళ్లారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని మూవీ టీమ్ చెబుతోంది. ఈ తరుణంలో పుష్ప 2 చిత్రం షూటింగ్ మళ్లీ షురూ కానుంది.ఈ క్రమంలోనే పుష్ప 2 షూటింగ్ పై ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఫారెన్ ట్రిప్ ముగించుకొని అల్లు అర్జున్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.వచ్చే వారం నుంచి పుష్పటు సెట్లో అడుగుపెట్టనున్నారు.

ఇప్పటికే rfc లో ఇతర నటీనటులపై సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా కొత్త షెడ్యూల్లో ఐకాన్ స్టార్ పై క్లైమాక్స్  సీన్లను చిత్రికరించనున్నారు. డైరెక్టర్ తో గొడవపడి అల్లు అర్జున్ ఫారెన్ వెళ్లినట్టు వార్తలు రాగా ఈ మధ్య చిత్రం యూనిట్ వాటిని ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు.శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుని అనుకున్న టైమ్ డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ సంతోషపడుతున్నారు.గతంలో రిలీజ్ అయిన పుష్ప సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు పుష్ప 2ను మరింత జాగ్రత్తగా అడియన్స్ అంచనాలకు మించి ఉండేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుందని.. అలాగే సమంత గెస్ట్ అప్పీయరెన్స్ ఉందని టాక్ నడుస్తుంది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: