టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా మారి ఓవర్ యాక్షన్ చేసి వార్తల్లో నిలిచే ముద్దుగుమ్మల్లో తాప్సీ పన్ను ఒకర్తి. ఈ హాట్ బ్యూటీ గత కొంతకాలం నుంచి వివాదాలతో బాగానే వార్తల్లో నిలుస్తోంది.నోటి దూల ఎక్కువై మాట్లాడుతూ  వివాదాల్లో చిక్కుకుంది. అక్కడ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో కూడా ఈ అమ్మడు పెద్ద వారే పెట్టుకుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీలతో పాటు స్టార్ హీరోల మూవీల్లో నటిస్తూ రాణిస్తుంది తాప్సీ.ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ పన్ను చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పై చాలా సార్లు నెటిజన్స్ ట్రోల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె నెటిజన్స్ కోపానికి గురయ్యింది. అభిమానంతో సెల్ఫీ అడిగిన ఓ యువతితో తాప్సీ పన్ను ప్రవర్తించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. నెటిజన్లు చాలా కోపంగా రియాక్ట్ అవుతున్నారు. తాప్సీ పన్ను ‘ఖేల్ ఖేల్ మే’ అనే చిత్రంలో నటించింది. 


ఈ మూవీలో అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా పాటల రిలీజ్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మందిని కూడా ఆహ్వానించారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అనన్య ద్వివేది అనే ఓ యువతి కూడా వచ్చింది. అనన్యతో తాప్సీ పన్ను ఎంతో అణిచితంగా ప్రవర్తించింది.ఇక పాట విడుదలైన తర్వాత, అనన్య ద్వివేది తాప్సీ పన్ను వద్దకు వెళ్లి సెల్ఫీని కోరింది. అయితే తాప్సీ అందుకు గాను నిరాకరించింది. ఈ సందర్భంగా ఆమె తీసిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో.. నెటిజన్స్ ఎంతగానో మండిపడుతున్నారు. అంత పొగరు పనికి రాదు కొంచెం తగ్గించుకో అంటూ జనాలు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయినంత మాత్రాన ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం సరికాదని పలువురు ఆమెని విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై తాప్సీ ఇంకా స్పందించలేదు. తాప్సీ ఝమ్మంది నాదం అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో అణిగి మణిగి ఉండే తాప్సీ తీరా కాస్త క్రేజ్ వచ్చాక అన్నం పెట్టిన టాలీవుడ్ పైన చెత్త కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: