నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ' రాయాన్ ' జూలై 29న థియేటర్లలోకి వచ్చింది మరియు ఈ చిత్రానికి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ను చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు చేరారు. ఈ చిత్రాన్ని చూసిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.రాయన్, ధనుష్ స్టెల్లార్ యాక్ట్. అద్భుతంగా దర్శకత్వం వహించి, ప్రదర్శించారు. ఎస్.జే. సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ మరియు నటీనటులు అత్యుత్తమ ప్రదర్శన అందించారు. మాస్ట్రో రెహమాన్ ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్ అని కొనియాడారు. రాయన్ తప్పక చూడవలసిన చిత్రం అని అన్నారు. మొత్తం టీమ్‌కి అభినందనలు తెలిపారు.ఇప్పుడు, టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు తన ప్రతిభకు నటుడు-దర్శకుడిని అభినందించడానికి తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను తీసుకున్నాడు.నటుడిగా ధనుష్ కెరీర్‌లో 'రాయాన్' 50వ చిత్రం కూడా. సాయి ధరమ్ తేజ్, కార్తీ, జివి ప్రకాష్ కుమార్ మరియు మరెన్నో నటులు కొన్ని రోజుల క్రితం తన 50వ చిత్రం విడుదలకు ముందు నటుడికి శుభాకాంక్షలు తెలిపారు. 'రాయాన్'కు లెజెండరీ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో S. J. సూర్య, ప్రకాష్ రాజ్ , సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు శరవణన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.సూపర్ స్టార్ మహేశ్ బాబు  సినిమాల విషయానికొస్తే  దర్శకధీరుడు రాజమౌళి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇంకా మొదలు పెట్టలేదు. అన్నీ రెడీ అయిన తర్వాతనే రెగ్యూలర్ షూట్ ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: