స్వీటీ అనుష్కకి ఏమైంది.. ఎందుకు తన ఇన్ స్టా గ్రాం లో దేవసేన పోస్ట్ పెట్టింది అంటూ సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్ జరుగుతుంది. నిశ్శబ్ధం సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క తన లుక్ మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఐతే లాస్ట్ ఇయర్ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించింది అమ్మడు. ఆ సినిమా తర్వాత లేటెస్ట్ గా క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంది.

మలయాళంలో కూడా అనుష్క లీడ్ రోల్ లో ఒక సినిమా వస్తుంది. ఇదిలాఉంటే లేటెస్ట్ గా అనుష్క బాహుబలి దేవసేన ఫోటోని తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. అసలు స్వీటీ ఎందుకు ఆ పోస్ట్ షేర్ చేసింది అన్నది అర్ధం కాక ఆమె ఫాలోవర్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐతే అనుష్క మళ్లీ తన మునుపటి రూపాన్ని అదే స్లిం లుక్ ని పొందిందా అందుకే ఆమె ఆ పోస్ట్ చేసిందా అనుకుంటున్నారు.

బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన దేవసేనగా అనుష్క అదరగొట్టేసింది. అసలు ఆమెను చూస్తే కళ్లు మరో వైపు తిప్పలేం అనేంతగా మెస్మరైజ్ చేసింది. ప్రభాస్ అనుష్క జోడీ కూడా ఆ సినిమా హిట్ కు ప్రధాన అంశంగా నిలిచింది. అనుష్క మళ్లీ ప్రభాస్ తో నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అనుష్క క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఫిమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ గా వస్తుంది. మరోసారి మరో డిఫరెంట్ రోల్ తో అనుష్క తన సత్తా చాటనుందని తెలుస్తుంది. మలయాళంలో కూడ అనుష్క చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తప్పకుండా స్వీటీ అక్కడ కూడా ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంటుందని చెబుతున్నారు. రాబోతున్న రెండు సినిమాలతో అనుష్క అదరగొట్టేయడం ఖాయమని స్వీటీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: