కల్కి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది. ప్రభాస్ తర్వాత అసలైతే లెక్క ప్రకారం పుష్ప 2 తో అల్లు అర్జున్ రావాల్సి ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 ఇంకా సెట్స్ మీద ఉంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం పుష్ప 1 వచ్చి పాన్ ఇండియా హిట్ అందుకోఘా ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అంతకుమించి ఉండేలా చేస్తారని ఆడియన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.

ఐతే సినిమాను అంచనాలకు తగినట్టుగా తెరకెక్కించే ప్లానింగ్ లో సుక్కు ఎక్కువ కన్ ఫ్యూజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అసలైతే సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేయాల్సింది కానీ తనని తొందర పెడితే సినిమా అవుట్ పుట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ తర్వాత మళ్లీ తనని అనొద్దని చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవ అని సుకుమార్ కు కావాల్సినంత టైం తీసుకో అని అన్నారు.

ఫైనల్ గా డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ లాక్ చేశారు. కానీ ఆగష్టు 15 న అనుకున్న డేట్ కి వచ్చి ఉంటే సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చి ఉండేది. పుష్ప 2 వస్తున్నాడని తమ సినిమాలను సైడ్ చేసిన మిగతా హీరోలు అల్లు అర్జున్ బదులుగా బాక్సాఫీస్ ఫైట్ లో దిగుతున్నారు. ఈ ఆగష్టు 15కి మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు పోటీ పడుతున్నాయి. రెండు సినిమాలు మాస్ కంటెంట్ తో వస్తున్నాయి. ఐతే ఎవరికి వారు ఈసారి విజేత మేమే అన్నట్టు ధీమాగా ఉన్నారు. ఐతే పుష్ప 2 మాత్రం ఒక మంచి డేట్ మిస్ అయ్యిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సుకుమార్ కాస్త సపోర్ట్ చేసి ఉంటే మాత్రం అనుకున్న డేట్ కి పుష్ప 2 వచ్చి హంగామా చేసేది. ఐతే సినిమా పోస్ట్ పోన్ అయినా సినిమా అంచనాలను అందుకోవడం లో మాత్రం తగ్గేదేలే అంటున్నారు మేకర్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: