కేరళలోని వయనాడులో కొండచరియలు విరిగి ఇళ్లపై పడ్డాయి. ఈ భారీ ప్రకృతి వైపరీత్యం వల్ల 300 మందికి పైగా చనిపోయారు 200 మంది ఇప్పటికీ మిస్సింగ్. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చాలా ఆందోళన కలిగించింది. మరోవైపు ఈ బాధితులకు సహాయం చేయాలని ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో, నటి రష్మిక మందన్న కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బు సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. కేరళలోని వయనాడులో జరిగిన లాండ్ స్లయిడ్స్‌ ఘటనలో ప్రభావితమైన వారికి సహాయం చేయడానికి ఆమె 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

కేరళ ప్రజలు ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు నేను వారితో ఉన్నానని, వారికి అండగా ఉంటానని రష్మిక మందన్న చెప్పారు. రష్మిక మందన్న ఎప్పుడూ ఇలాంటి సహాయ కార్యక్రమాలకు ముందుంటారు. ప్రస్తుతం ఆమె పుష్ప 2: ది రూల్, సికిందర్, ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమాల్లో నటిస్తున్నారు.

వయనాడు సంఘటన బాధితులకు సహాయం చేయడానికి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి చాలామంది సినీ ప్రముఖులు డబ్బులు విరాళంగా ఇస్తున్నారు. రష్మిక కంటే ముందు, తమిళ నటుడు సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ కలిసి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా, నయనతార-విఘ్నేశ్ శివన్ కలిసి 20 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఇలాంటి మంచి పనులు చేసినందుకు రష్మిక మందన్న, ఇతర సినీ ప్రముఖులను అభిమానులు, మీడియా బాగా ప్రశంసించారు. రష్మిక ఈమధ్య సినిమాలోకి వచ్చింది అయినా అందరికంటే ముందే 10 లక్షలు ఇచ్చి తన మంచి మనసును చాటుకుంది. ఆమె ఫ్యాన్స్ ఆమెకు హాట్సాఫ్ అని చెబుతున్నారు. ఆమెను చూసి మరి కొంతమంది యంగ్ హీరోయిన్లు డబ్బులు విరాళంగా అందజేస్తే కష్టాల్లో ఉన్న ప్రజలను ఎంతగానో ఆదుకున్నట్లు అవుతుంది. బన్నీ, తారక్, చెర్రీ, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా మనీ డొనేట్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: